BREAKING : మెదక్‎లో బీజేపీకి బిగ్ షాక్..

0
17

మెదక్ : మెదక్ బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్‎లో గట్టి షాక్ తగిలింది. బీజేపీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి వెళ్లిన పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం పార్టీలోకి ఆహ్వానించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారికి వెల్కమ్ చెబుతోందన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‭లో చేరిన పులి మామిడి రాజును సీఎం అభినందించారు.

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‎తో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిశారు. కొద్దిసేపు ఆమె పార్టీ వ్యవహారాలపై నీలం మధు, పులి మామిడి రాజుతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో పులి మామిడి రాజుకు దీపాదాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పులి మామిడి రాజు ఈ ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.