EVM: ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో ఎలాన్ మస్క్ నిరూపించాలి- ఎంపీ పురంధేశ్వరి

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని.. కొంత మేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని.. మనుషులు కానీ, ఏఐ టూల్స్‎తో కానీ ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్‎లో దుమారం రేపుతున్నాయి. మస్క్ వ్యాఖ్యలను విపక్షాలు ఓ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్‎లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్‎ల వంటివని.., వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న ఎలాన్ మస్క్‎ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని.., ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలామందికి అవకాశం ఇచ్చిందని.., కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి స్పష్టం చేశారు.