TS POLITICS : మెట్రోలో మాజీ మంత్రి మల్లారెడ్డి

0
16

మేడ్చల్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు వినూత్న ప్రచారానికి తెరలేపారు. గురువారం మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో మెట్రోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రో రైలులో ప్రయాణం చేసి మెట్రో ప్రయాణికులను ఓటేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు. ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసింది కేటీఆర్ అని.., వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి అధిక నిధులు తెస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా, శంబీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.