TG Politics: ఇంకో నాలుగు గేట్లు తెరిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఖాళీ: బీర్ల ఐలయ్య

0
21

తెలంగాణలో ప్రధాన పార్టీలను జంపింగ్ జపాంగులు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ లో చేరుతుండగా..మరికొందరు బీజేపీలోకి చేరుతున్నారు. అయితే త్వరలోనే 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ తో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు… వాళ్లంతా కాంగ్రెస్ లో చేరతారు. ప్రజాపాలన నచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటున్నారు. ఇంకో నాలుగు గేట్లు తెరిస్తే బీజేపీ, బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోని చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నిన్న కంటోన్మెంట్ బీజేపీ ఇన్ చార్జ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జిల్లాలోనూ బీఆర్ఎస్ కు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. లోక్ సభ ఎన్నికల వరకు ఇంకా ఎంత మంది పార్టీలు మారుతారో చూడాలి.