Ap Politics: ఎన్నికల తర్వాత ఫస్ట్ టైమ్ భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్..!

0
10

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునుంది. ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు.., ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. వీరితో పాటు 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో 31వ తేదీపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో బాబు, పవన్ కూటమి గెలిస్తే సీఎం ఎవరూ ఇతర ముఖ్య విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక, ఎన్నికల అనంతరం విదేశ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బుధవారం ఉదయమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. 31న కీలక భేటీ ఉండటంతో గురువారం రాత్రికి అమరావతికి బాబు వెళ్లనున్నారు.