Breaking: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ అధినేత కేసీఆర్‌కు వరస షాకులిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ యాదయ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 39 సీట్లను సాధించి ప్రతిపక్షంలో వెళ్లింది. అదేవిధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని 64 సీట్లలో విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.