CBN: ఇచ్చిన మాట ప్రకారం హామీని నేరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుదే- హోంమంత్రి అనిత

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటల మేరకు హామీని నేరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని హోంమంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ మంగళగిరిలోని పింఛన్ పండుగ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్డీఏ పాలనతో రాష్ట్రానికి ఇక మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. అన్ని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. పింఛన్ల పంపిణీతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. పెరిగిన పింఛన్‌తో రూ.4వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ. 7000 పింఛన్ అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.