CM Revanth Reddy Delhi Tour Today: ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ

0
7

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితాపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మిగతా 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఈ భేటీలోనే అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వస్తుందని, ఆలోపే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. బీజేపీ 15 నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించిందని, కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ప్రకటన త్వరగానే ఉటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాసు మున్షీబుధవారం భేటీ అయ్యారు.

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చేపట్టిన అభిప్రాయ సేకరణ అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో చేపట్టిన అభిప్రాయాలను వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.