Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో కుప్పకూలిన టెర్మినల్-1 పైకప్పు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజదాని నగరం చిగురుటాకులా వనికిపోతోంది. ఢిల్లీలో కురిసిన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలకు తెల్లవారు జామున 5.30 గంటల ప్రాతంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం కూలింది. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఈ ప్రమాదంలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి.

అయితే ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలానే ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ ఎయిర్ పోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. టెర్మినల్ 1 నుండి బయల్దేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశామని.. అలానే చెక్- ఇన్ కౌంటర్లను కూడా మూసివేశామని, ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. క్షమాపణలు కోరుతున్నామని మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.

పూర్తి వీడియో కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి: https://youtu.be/gv4HFxMFQfU?si=E0ZEjnEpQ9B0LjQD