AP Politics: రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు కాసు.. గురజాలలో ఫ్లెక్సీల కలకలం

0
21

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఎన్నికల ముందు వైసీపీ నేతలు చేసిన సవాళ్లు ప్రస్తుతం వారికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడతున్నాయి. మొన్నటి మొన్న కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. ఆయన బూట్లలు పాలిష్ చేస్తానని అన్న కొడాలి నానిపై టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఏకంగా గుడివాడలో చంద్రబాబు షూ పాలిష్ ఎప్పుడు చేస్తావంటూ బ్యానర్లు వేసి టీడీపీ నాయకులు మాస్ ర్యాగింగ్ చేశారు. తాజగా, గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గురుజాల నుంచి యరపతినేని శ్రీనివాస‌రావు గెలిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాసు మహేష్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. దీంతో ఆయన ఓటమిపాలు అవ్వడంతో రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఫ్లెక్సీ వేసి కాసు మహేశ్‌రెడ్డిని ప్రశ్నించారు. అయితే, అందుకు సంబంధించిన ఫ్లెక్సీలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.