BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.., నిందితులు తప్పించుకోవడానికి యత్నిస్తున్నారన్నారు. నిందితుల ప్రయత్నాలను నిర్వీర్యం చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామని.., కీలక నిందితుల అరెస్ట్‎కు యత్నిస్తున్నామన్నారు. కేసుతో సంబంధం ఉన్న వారు ఎంతటివారైన వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు.., రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.