TS News: డీఎస్ మృతి పట్ల సంతానం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమై.. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా, డీఎస్ మరణం పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటు అని.. ఆయన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా భట్టి గుర్తుచేసుకున్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు. డీఎస్ కుటుంబసభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ధర్మపురి శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్‎గా పని చేశారు. ఇక రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ రెండోసారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు.