Gowtham Gambhir : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. గంభీర్ కీలక ప్రకటన

0
22

బీజేపీ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు 2024 మార్చి 02 శనివారం రోజున ఎక్స్ లో పోస్టు చేశాడు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్ ట్వీట్ చేశారు. ‘క్రికెట్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకే రాజకీయాలకు దూరమవుతున్నా. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు’ తెలిపారు. కాగా గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా గౌతమ్ గంభీర్ 2019 మార్చి 22న భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీపై 3,90,391 ఓట్ల మెజారిటీతో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు గంభీర్ ఇలాంటి ప్రకటన చేయడం అందర్నీ షాకు గురి చేసిందని చెప్పాలి.