TG Politics: కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్

0
28

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాసేపటి క్రితమే కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ కండువా కప్పి విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు.

తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ నిన్ననే ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని విజయలక్ష్మీ అన్నారు.

విజయలక్ష్మీ తండ్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్న సీఎం రేవంత్ ను కలిసిన కేకే.. తాను 55 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నానని..తిరిగి సొంత ఇంటికి వస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమయ్యింది.