BREAKING : ఆన్‎లైన్ గేమ్‎లో డబ్బులు పోగొట్టుకొన్న యువతి.. చోరీ డ్రామా

0
20

రాజేంద్రనగర్ : ఆన్‎లైన్ గేమ్‎లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామా ఆడిన ఘటన రాజేంద్రనగర్‎లో చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ యువతి.. ఆన్‎లైన్ గేమ్ ఆడి రూ. 25 వేలు పోగొట్టుకుంది. అయితే దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇంట్లోనే డబ్బులు కాజేసి దొంగల మీదకి నెట్టెసింది. ఇద్దరు దొంగలు ముసుగు వేసుకొని ఇంట్లోకి చొరబడి డబ్బులు కాజేశారని డ్రామా అడింది. పోలీసులు విచారణలో అసలు నిజం బయట పడింది. గురువారం ఉదయం 10 గంటలకు ఎర్రబోడ కాలనిలో ఉన్న ఓ ఇంట్లోకి ముసుగు వేసుకొని దొంగలు వచ్చారని.. తాను వాష్ రూమ్‎లోకి వెళ్లివచ్చేసరికి బీరువాలో ఉన్న డబ్బు, బంగారం, వెండి నగదును తీసుకొని దొంగలు పరారి అయ్యారని.. తాను గట్టిగా కేకలు వేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినా అప్పటికే దుండగులు పారిపోయారని ఆమె తెలిపింది. ఇంట్లో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అనుమానం వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అప్పుడే అసలు నిజం బయటపడింది. ఇదంతా డ్రామా అని.. ఆన్‎లైన్ గేమ్‎లో యువతి 25 వేలు డబ్బును పోగొట్టుకుందని.. దానిని కప్పిపుచ్చటానికి ఇలా దొంగలు పడ్డారని.. ఆ యువతి డ్రామా అడినట్లు ఎస్సై నాగేంద్రబాబు వెల్లడించారు.