Gummanuru Jayaram : వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా.. ఇవాళ టీడీపీలోకి

0
14

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి బిగ్ షాకిచ్చారు. పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్, సీఎం జగన్ కు పంపించారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలో నిర్వహించనున్న జయహో బీసీ సభ లో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

గుమ్మునూరు జయరాం 2009లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యాం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు . 2011లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధిశిక్షణ‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.