Ap Politics: ఆంధ్ర ప్రభుత్వంపై హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు.

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయ‌గా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఇక ఏపీలో ప్రభుత్వ మార్పుపై హీరో సుమన్ స్పందించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని.. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5ఏళ్ళు వెన్నక్కి వెళ్ళిందన్నారు హీరో సుమన్.