Indian Premier Ieague: గెట్ రెడీ.. ఇవాళ్టి నుంచి ఐపీఎల్ టికెట్లు

0
17

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుంది. చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌ టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒకరు రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మ్యాచ్ కు సంబంధించి స్టేడియంలో ఉన్న సి, డి, ఈ లోయర్ టికెట్ ధర రూ. 1700 కాగా.. ఐ, జె, కె అప్పర్ రూ. 4000 ఉండగా., ఐ, జె, కె లోయర్ రూ. 4500 గా నిర్ణయించారు.

వీటితో పాటు కేఎంకే టెర్రస్ టికెట్ ధర రూ. 7500 నిర్ణయించబడింది. అలాగే సి, డి, ఈ అప్పర్ రూ. 4000 గా టికెట్ ధరను నిర్ణయించారు. పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం కానుంది. అయితే ఒక్కరికి రెండు టికెట్లు మాత్రమే ఇవ్వబడతాయి.

తొలి మ్యాచ్‌ ఎంఎ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. ఆ రోజున పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 27న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు మార్చి 15 నుంచే అందుబాటులోకి వచ్చాయి.