IPL 2024: రిషబ్ పంతే కెప్టెన్..అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

0
15

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్ గా పంత్ ను అధికారికంగా ప్రకటించింది ఆ జట్టు యాజమాన్యం. నిన్న రాత్రి ట్విట్టర్లో పంతే ఢిల్లీ కెప్టెన్ అంటూ పోస్ట్ చేసింది. ఈ సీజన్ ఐపీఎల్ లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 14 నెలల తర్వాత వికెట్ కీపర్-,బ్యాట్స్‌మెన్ తిరిగి క్రికెట్‌ ఆడబోతున్నాడు. వైజాగ్ లో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ-సీజన్ ట్రైనింగ్ క్యాంపులో పంత్ పాల్గొన్నాడని వెల్లడించింది.

రిషబ్ పంత్ 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో గతేడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇటీవలే అతను మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా నడిపించాడు. ఇప్పుడు పంత్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్‌ని మార్చి 23న చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.