KA Paul Commented Mudragada: నా పార్టీలో చేరితే.. ముద్రగడే సీఎం అభ్యర్థి : కేఏ పాల్

0
12

మాజీ మంత్రి బాబుమోహన్ దారిలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నడవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ముద్రగడ అవినీతికి మారుపేరైన వైసీపీలో చేరేకంటే తన పార్టీలో చేరడం బెటర్ అని సూచించారు. ‘నా పార్టీలో చేరితే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా. మీ తరఫున 10 సీట్లు కేటాయిస్తా. నా మాట కాదని వైసీపీలో చేరితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నాతో కలిస్తే చరిత్రకెక్కుతారు’ అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు,పలువురు మంత్రులు తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు.

ముద్రగడ కొన్ని రోజుల క్రితం టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ..రెండు రోజుల క్రితం వైసీపీ నేతలతో భేటీ అయిన ముద్రగడ ఆపార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా ముద్రగడను వైసీపీలో చేర్చుకుని కాపు సామాజిక వర్గ ఓట్లను రాబట్టుకోవాలని చూస్తున్నారు.