TS BREAKING : కరీంనగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌.. అభ్యర్థిని ప్రకటించిన మంత్రి పొన్నం

0
28

కరీంనగర్ : కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్తిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కరీంనగర్ సీటుపై అధిష్టానం ఎటూ తేల్చలేదు. వెలిచాల రాజేందర్ రావే అభ్యర్థి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సన్నాహక సమావేశాలకు సైతం ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ అసెంబ్లీ సీటును ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. ఈ గందరగోళం మధ్య నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ దూరంగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి వైపు అధిష్టానం, వెలిచాల రాజేందర్ వైపు పొన్నం.. మొత్తానికి కరీంనగర్ స్థానం విషయంలో గందరగోళం నెలకొంది.