Politics: మోదీ సర్కార్ నన్ను టార్గెట్ చేసింది- కేసీ వేణుగోపాల్

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: నరేంద్రమోదీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(kc venugopal) ఆరోపించారు. తన మొబైల్ ఫోన్‌‌ లక్ష్యంగా స్పైవేర్‌ను గురిపెట్టిందని మండిపడ్డారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి ఆయనకు వచ్చిన అలర్ట్ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

‘ మోదీ జీ! మీకు ప్రియమైన స్పైవేర్‌ను నా ఫోన్లోకి పంపిస్తున్నందుకు థాంక్స్. మీరు పంపిన ఈ ప్రత్యేక కానుక గురించి యాపిల్ ఎంతో దయతో నన్ను అప్రమత్తం చేసింది. రాజకీయ ప్రత్యర్థుల వెంటపడుతూ వారి గోప్యతలో చొరబడటం మీ సర్కారు చేస్తున్న నేరపూరిత, రాజ్యాంగ విరుద్ధ చర్య. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ’ అని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్. 98 దేశాల్లోని వినియోగదారులకు ఈ అలర్ట్ మేసేజీలను పంపిస్తున్నామని.., వీటితో కలిపి 150 దేశాలకు ఇంతవరకూ ఇలాంటివి పంపించామని యాపిల్ తెలిపినట్టు వేణుగోపాల్ పేర్కొన్నారు.