Kcr Statement: పోయే వాళ్లు పోనీ .. కార్యకర్తలకు కేసీఆర్ భరోసా

0
15

నాయకులు పోయినంత మాత్రాన ఎవరూ అధైర్యపడొద్దు… కార్యకర్తల బలం ఉందని, ఆదిలాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభావం ఉండదు… గట్టిగా కష్టపడితే మనమే గెలుస్తామఅని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్… ఈ సందర్భంగా నేతలంతా తమకు బీఆర్ఎస్ అభ్యర్థినే కావాలని కోరారని తెలిపారు.

బీఎస్పీ అభ్యర్థి వద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. చివరగా అభ్యర్థి ఎంపిక విషయం, ఏ పార్టీ పోటీచేసే దానిపై అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సూచించారు. ఈ సమావేశంలో బీఎస్సీ నుంచి టికెట్ ఆశిస్తున్న గణపతి సైతం పాల్గొన్నారు. బుధవారం బీఎస్పీతో జరిగిన సమావేశంలో ఆదిలాబాద్ స్థానాన్ని పొత్తులో భాగంగా ఆ పార్టీ కోరింది.

అందుకు బీఆర్ఎస్ సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం సాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఇస్తామని అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. మొన్నటి వరకు ఆ సీటు ఆయనకే అన్న ప్రచారం సైతం సాగింది. ఇచ్చిన మాట ప్రకారం ఆత్రం సక్కుకు టికెట్ ను ప్రకటించారు కేసీఆర్