KCR: రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి, మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్.

0
21

పాయింట్ బ్లాంక్, వెబ్‌ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తొలి ఏకాదశి(Shayani Ekadashi), మొహరం(muharram) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో హిందువులు తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారని.. త్యాగానికి గుర్తుగా, హిందూ ముస్లింలు ఐక్యంగా పీర్ల పండుగ నిర్వహించకుంటున్నారని తెలిపారు. తెలంగాణ గంగా జమున తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు.