Lok Sabha elections 2024: మెదక్ సీటును సోనియా గాంధీ గారికి బహుమతిగా ఇస్తాం: నీలం మధు ముదిరాజ్..

0
20

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షితో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి రుణపడి ఉంటానని తెలిపారు.
తనకు టికెట్ రావడంలో సహకరించిన దీపా దాస్ మున్షి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో మెదక్ పార్లమెంట్ టికెట్ను కేటాయించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మెదక్ సీటును గెలిచి కానుకగా అందిస్తాం అని స్పష్టం చేశారు. అందరి సహకారంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాల నేతలను కలుపుకొని ఎన్నికల్లో ముందుకు పోయి మెదక్ సీటును గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.