Big Shock To Pawankalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ … వైసీపీలోకి మాకినీడు శేషుకుమారి

0
26

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగలనుంది. జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గత కొంతకాలంగా జనసేనకు దూరంగా ఉంటున్న ఆమె.. వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని తాజాగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె వెళ్లినా తమకు ఇబ్బంది లేదని.. పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనసైనికులు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేసిన శేషుకుమారికి సుమారు 27 వేల ఓట్లొచ్చాయి. శేషుకుమారికి వచ్చిన ఓట్లలో ఆమె వ్యక్తిగత ఓట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాపు నేతయిన శేషుకుమారి పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డారు. కాబట్టే ఆమెకు అన్ని ఓట్లొచ్చాయి. గ‌త‌ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 138 నియోజకవర్గాల్లో 27 వేల ఓట్లు తెచ్చుకున్న నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు.