Megastar: రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు- చిరంజీవి

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీ ఫిల్మ్‎సిటీలో ఆయన పార్థివదేహానికి మెగాస్టార్ నివాళులర్పించారు. అనంతరం చిరు మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావుతో తనకు చాలా అనుబంధం ఉండేదని.. సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షరరూపంలో రాసేవారని.. పెన్నులు బహుమతిగా ఇస్తే ఎంతో ఆయన సంతోషించేవారని చెప్పారు. పెన్నులు సేకరించడం రామోజీరావుకు హాబీ అని మెగాస్టార్ వెల్లడించారు. రామోజీరావు ఎప్పుడూ సమాజం గురించే ఆలోచించేవారని.., ఆయన మృతి సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందని.. రామోజీరావు కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. కాగా, రామోజీ రావు భౌతికాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి క్యూ కట్టారు.