MEGASTAR : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున చిరంజీవి ప్రచారం

0
29

పాయింట్ బ్లాంక్, పిఠాపురం: అటు అసెంబ్టీ, ఇటు సార్వత్రిక ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌లో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలతో ఏపీ దద్దరిల్లుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ, జనసేన, టీడీపీ ఎన్నికల ప్రచారంలో నువ్వా..? నేనా? అంటూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తమ్ముడు గెలుపుకోసం తనవంతు ప్రయత్నం చేసేందుకు అన్నయ్య రెడ్డి అయ్యారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తమ్ముడు పవన్ తరఫున అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వచ్చే నెల మే 5వ తేదీన ఆయన పిఠాపురంలో పర్యటించి జనసేనకి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు పద్మ విభూషణ్ మెగా స్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్, నాగబాబు అలానే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి పాల్గొననున్నారని సమాచారం.