TS Politics: పోడు భూములపై మంత్రి కొండా సురేఖ సమీక్ష.

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: పోడు భూములపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డా. బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పోడు భూముల సమస్యలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ సహా అటవీ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోడుభూములపై తలెత్తే సమస్యలను కొండా సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.