TS News: డీఎస్ మృతి పట్ల సంతానం తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా డీ. శ్రీనివాస్ మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు పొన్నం ప్రభాకర్.