AP News: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. నేడు నామినేషన్ దాఖలు

0
23

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో కూటమి తరపున వారిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలం కొనసాగారు. మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక పి. హరి ప్రసాద్ చాలా కాలం జర్నలిస్టుగా పని చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో ఆయన సలహాదారుడిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి జనసేన, పవన్ కోసం పని చేస్తున్నారు. దీంతో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో నిలిచే అవకాశం దక్కింది.