LiqourScam: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

0
28

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జులై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్డడీని కోర్టు పొడిగించింది. ఇవాళ్టితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. తదుపరి విచారణను జులై 25కి రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.