TS News: దీక్ష విరమించిన నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్.

0
30

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులుగా దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదన్నారు. రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలు పెంచాలని.. గ్రూప్-1లో 1:100 శాతం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష కారణంగా కిడ్నీలు, లంగ్స్ పనిచేయని పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్.