TS POLITICS : కాంగ్రెస్ పార్టీది చాలా ప్రమాదకర మేనిఫెస్టో- ఎంపీ అర్వింద్

0
10

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‎సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీది ప్రమాదకర మేనిఫెస్టో అని విమర్శించారు. ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. దేశ సంపదను వారికి దోచే పెట్టేలా ఆ మేనిఫెస్టో ఉందని విమర్శలు గుప్పించారు. లోక్‎సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. భారత్ రోహింగ్యాలకు అడ్డాగా మారుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారని.., కేసీఆర్ ఒక ఫ్రస్టేటెడ్ ఫాదర్ అని ఎద్దేవా చేశారు.