AP POLITICS : పిఠాపురానికి కడప నుంచి రౌడీలు, గుండాలు- నాగబాబు

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకి, కూటమి నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు, కడప నుంచి గుండాలు, రౌడీలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర వెనుక వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వారిరువురూ కలిసి పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా.. ఎంతమందిని తీసుకొచ్చిన పవన్‌ను ఓడించడం అసాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంతమందిని తీసుకువచ్చినా.. తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎంతమంది వస్తారో రండి.. చూసుకుందాం.. అని నాగబాబు వైసీపీ నేతలను హెచ్చరించారు.