AP Politics: ఇవాళ్టి నుంచి భువనేశ్వరీ నిజం గెలవాలి యాత్ర

0
20

ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో కడప, అన్నమయ్య జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి రూ.3 లక్షల పరిహారం కూడా చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సిద్ధం చేస్తోంది.

ఇవాళ ఉదయం రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సాగనుంది. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం బద్వేలు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన కొనసాగనుంది. 22 గూడూరులో, 23 సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటిస్తూ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను కలుసుకోనున్నారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగించనున్నట్లు కార్యకర్తలు తెలుపుతున్నారు. అటు లోకేశ్ శంఖారావానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో విజయోత్సాహంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.