CBN: రామోజీరావు పార్థివదేహానికి నారా చంద్రబాబు నివాళులు

0
10

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఫిల్మ్‎సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నారా చంద్రబాబు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు దంపతులు పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. అనంతరం రామోజీరావు మరణం చాలా బాధాకరమని చంద్రబాబు తెలిపారు. అలానే ఈ ఉదయం ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నారా చంద్రబాబు.