CBN: రామోజీరావు పాడె మోసిన సీఎం చంద్రబాబు.. కన్నీళ్లు పెట్టుకున్న బాబు

0
43

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమయాత్ర ఫిల్మ్‌ సిటీలోని స్మృతి వనంలో పూర్తయింది. ఈ క్రమంలో అంతిమయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనంతరం రామోజీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించి ఉద్విగ్నమైన క్షణాల్లో పాడెను మోశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఆర్‌పీ సిసోడియా, రజత్ భార్గవ, సాయి ప్రసాద్ ఐఏఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.