Ap Politics: రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో “ప్రజాదర్భార్” పేరిట ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ఉదయం 8 గంటలకు ఆయన “ప్రజాదర్భార్” నిర్వహించనున్నారు. అయితే మంగళగిరిలో ఆయన ప్రజలను కలిసి వారి సమస్యలను విన్నారు. కొంత మంది ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం కనబర్చారు.