TS NOMINATIONS : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. నాలుగో దశ ఎన్నికల కోసం నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‎సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై పోల్‎కు 38 మంది నామినేషన్లు దాఖల చేయాగా.. మిగిలిన లోక్‎సభ నియోజకవర్గాల వారిగా గురువారం మ. 3 గంటలకు వరకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

1. ఆదిలాబాద్- 39
2. భువనగిరి- 81
3. చేవెళ్ల- 59
4. హైదరాబాద్- 48
5. కరీంనగర్- 69
6. ఖమ్మం- 57
7. మహబూబాబాద్- 32
8. మహబూబ్ నగర్- 42
9. మల్కాజిగిరి- 101
10. మెదక్- 55
11. నాగర్ కర్నూల్- 23
12. నల్గొండ- 85
13. నిజామాబాద్- 77
14. పెద్దపల్లి- 74
15. సికింద్రాబాద్- 60
16. వరంగల్- 62
17. జహీరాబాద్- 41