JANASEANA : జనసేనకు స్టార్ క్యాంపెయినర్లు

0
19

మంగళగిరి : ఏపీలో ఎన్నికల వేళ దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ తమ ప్రచారంలో జోరును పెంచింది. జనసేన పార్టీ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు.. క్రికెటర్ అంబటి రాంబాబు, డాన్స్ మాస్టర్ జానీ, సినీ నటులు పృథ్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను, శ్రీసాగర్‎లను క్యాంపెయినర్లుగా నియమించినట్లు లేఖను విడుదల చేశారు. ఇప్పటికే పిఠాపురంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్‎కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు నటుడు హైపర్ ఆది పిఠాపురంలో తిష్ట వేశారు. దీంతో స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంతో జనసేన పార్టీకి ఎంత వరకు లాభం రాబోతుందో చూడాల్సి ఉంది.