Prashanth Kishore Sensual Comments On YS Jagan: జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నం.. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు కలకలం

0
15

2017లో జనసేనతో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడిందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఆ సమయంలో వైసీపీలో అంతర్మథనం జరిగింది. ఎలాగైనా పవన్ కళ్యాణ్ దోస్తీ చేయాలని వైసీపీ అనుకుంది. కానీ వారి ప్రయత్నం ఫలించలేదని ఆయన అన్నారు. ఈ వీడియోను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.అయితే ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి వెల్లడిస్తున్నారో మాత్రం ఈ వీడియోలో వెల్లడి కాలేదు.
ఈ వీడియోతో పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలిసి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లిస్టును కూడా రిలీజ్ చేశారు. టీడీపీ జనసేన కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు.అలాగే ఈ నెల 17న చిలకలూరి పేటలో ఉమ్మడి బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశంఉంది.