Pulaparthi Joined TO Janasena: త్వరలో జనసేనలోకి పులపర్తి రామాంజనేయులు..భీమవరం నుంచి పోటీ?

0
12

భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు త్వరలో జనసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గత వారంలో ఆయన పవన్‌తో భేటీ అయ్యారు. గురువారం నియోజకవర్గ నాయకులతో మంగళగిరి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని రామాంజనేయులు తెలిపారు.

కాగా 2009, 2014లో భీమవరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌పై ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ వీరిద్దరిపై వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గెలిచారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రామాంజనేయులు వియ్యంకుడు కావడం విశేషం. ఒకవేళ పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకపోతే ఆ టికెట్ పులపర్తికి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. అయితే భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా, అక్కడ జనసేన గెలవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.