Reddy Shanthi Sensational Comments: వాలంటీర్లు ఓటర్లకు నగదు పంపిణీ చేయాలి : వైసీపీ ఎమ్మెల్యే

0
14

వాలంటీర్లపై పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘వాలంటీర్లు జగనన్న నియమించిన సైనికులు. అవసరమైతే ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేయాలి’ అని వాలంటీర్లతో జరిగిన సమావేశంలో అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే వాలంటీర్ల సహకారం అవసరమన్నారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు అందజేశారు.

వాలంటీర్లకు జగన్‌ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని.. అన్ని ఓట్లు వైకాపాకు వేయించే బాధ్యత వారిదేనని కాకినాడ ఎంపీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి వంగా గీత, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమలశెట్టి సునీల్‌ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో బుధవారం వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.కాగా ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచా లని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.

రెడ్డి శాంతి సీనియ‌ర్ నేత పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కుమార్తె. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ నేత కింజరాపు రామమోహననాయుడు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలోవైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ నేత కలమట వెంకటరమణ మూర్తి పై విజయం సాధించారు.