Revanth Reddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనమండలికి ఎన్నికైన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. కాగా, తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఇదే స్థానంలో ఆనాడు గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు. తాజాగా ఆయన గెలుపుతో ఆయన అభిమానులు సంబరాలకు సిద్ధం అవుతున్నారు.