Parliament: లోక్‎సభలో గందరగోళం.. అసదుద్దీన్ ఓవైసీపై అధికార పక్షం ఫైర్

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. ప్రమాణం చివర్లో అసదుద్దీన్ ఓవైసీ‘జై భీమ్, జై తెలంగాణతో పాటు.. జై పాలస్తీనా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పార్లమెంట్‌లో జై పాలస్తీనా అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ సభ్యులకు సర్ది చెప్పినా కాని అధికార పక్షం సభ్యులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో నినాదాల మధ్యే ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.