Liquor Scam: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను కలిసేందుకు ఆ పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ములకాత్‌లో భాగంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను కలిసిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు జులై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న అధికారులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు.