Secunderabad BRS Mp Aspirant Dasoju: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ?

0
18

సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాలపై బీఆర్ఎస్ గట్టి ఫోకస్ పెట్టింది. ఈ స్థానాల్లో ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది. సికింద్రాబాద్ నుంచి మొదట తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడికి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పోటీకి ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పుడు దాసోజు శ్రవణ్ వైపు అధిష్టానం చూస్తోంది. ఉద్యమకారుడు కావడం, గతంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడంతో ఆయనకు కలిసి రానుంది.

తెలంగాణ కోసం నెలకు రూ.15 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి వచ్చిన దాసోజు శ్రవణ్ కు మొదటి నుంచి అన్యాయమే జరుగుతూ వస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వెల్లడవుతోంది. సికింద్రాబాద్ స్థానాన్ని దాసోజు శ్రవణకు దాదాపు ఖరారు చేసినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ టికెట్ ఇస్తే లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని ఇప్పటికే శ్రవణ్ తెలిపారు.

ఇక్ బీఆర్ఎస్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. మల్కాజిగిరి నుంచి శంభీపూర్ రాజు పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నా ప్రకటనలో ఆలస్యం చేస్తున్నారు. హైదరాబాద్ స్థానానికి ఆనంద్ గౌడ్ కోరుతున్నారు. ఇక్కడ నామమాత్రపు పోటీ కాబట్టి ఆనందకు ఇచ్చే అవకాశాలున్నాయి.