Modi: మోదీ కేబినేట్‎లో ఏడుగురు మహిళలకు చోటు

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ప్రదానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. మోదీతో పాటు మరో 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడుగురు మహిళలకు మోదీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. కానీ, గతసారి మాత్రం కేబినేట్‎లో పదిమంది మహిళలకు చోటు దక్కింది. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన స్మృతి ఇరానీ, డాక్టర్ భారతీ పవార్, సాధ్వి నిరంజన్ జ్యోతి, దర్శన జర్దోష్, మీనాక్షి లేఖి, ప్రతిమా భూమిక్‎లకు మంత్రిమండలిలో చోటు దక్కలేదు. రాజ్యసభ ఎంపీ నిర్మలా సీతారామన్ మరోసారి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆమె పనిచేశారు. ఝార్ఖండ్‎కు చెందిన ఓబీసీ నాయకురాలు, బీజేపీ నేత అన్నపూర్ణాదేవి మోదీ మంత్రిమండలిలో చేరారు. మధ్యప్రదేశ్‎కు చెందిన గిరిజన నాయకురాలు సావిత్రి ఠాకూర్ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. గుజరాత్‎కు చెందిన బీజేపీ నాయకురాలు నిముబెన్ బంభానియాకు కేబినేట్‎లో స్థానం లభించింది. మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేకు, కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజేలకు కేంద్రమంత్రిపదవి దక్కింది. అప్నాదళ్ నాయకురాలు, కుర్మీ కమ్యూనిటీకి చెందిన నేత అనుప్రియా పటేల్ కేబినేట్ బెర్త్ దక్కించుకున్నారు.