AP Politics:సీఎం జగన్ ప్రభుత్వంలో అంతా మాఫీయానే- వైఎస్ షర్మిల

0
21

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో అన్ని పార్టీలు విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించే విధంగా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ షర్మిల ప్రజలతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని మాఫియాలేనని.., అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను జగన్ మోసం చేశారని చెప్పారు. మద్యం, ఇసుక, మట్టిలో భారీ అవినీతి చేశారని మండిపడ్డారు. కావున ప్రజలందరు వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.